18 ఏళ్లుగా పాకిస్తాన్ చెరలో మగ్గిన మహిళ… ఎట్టకేలకు విడుదలై సొంత ఊరికి చేరుకున్న హసీనాబేగం

ఔరంగాబాద్ పోలీసుల చొరవతో హసీనాబేగం పాక్ జైలు నుంచి విడుదలై తన స్వస్థలానికి తీసుకువచ్చారు.

18 ఏళ్లుగా పాకిస్తాన్ చెరలో మగ్గిన మహిళ... ఎట్టకేలకు విడుదలై సొంత ఊరికి చేరుకున్న హసీనాబేగం
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:17 AM

Woman freed from Pakistani jail : పాకిస్తాన్ దేశంలో 18 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన భారత మహిళ హసీనాబేగంకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసుల చొరవతో హసీనాబేగం పాక్ జైలు నుంచి విడుదలై తన స్వస్థలానికి తీసుకువచ్చారు. చిన్నపాటి పొరపాటుతో పాకస్తాన్‌లో ఉండిపోయిన మహిళ రాకతో కుటుంబసభ్యలు, స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన భర్త బంధువులను కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ హసీనాబేగం (65) పాస్‌పోర్టు పోగొట్టుకొని జైలు పాలయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం ఆమెను 18 ఏళ్లపాటు జైలులో నిర్బంధించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు భారత్‌కు తీసుకువచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఔరంగాబాద్ నగరంలోని రషీద్ పురా ప్రాంతంలో నివాసముండే హసీనా సమాచారాన్ని పాక్ కు ఔరంగాబాద్ పోలీసులు పంపించారు. దీంతో పాక్ అధికారులు జైలు నుంచి హసీనాను విడుదల చేసి భారత అధికారులకు అప్పగించారు. దీంతో హసీనా తన స్వస్థలమైన ఔరంగాబాద్‌కు వచ్చారు.

పాక్ జైలు నుంచి తిరిగివచ్చిన హసీనాబేగంకు ఆమె బంధువులు స్వాగతం పలికారు. నన్ను బలవంతంగా జైలులో వేశారు. నేను పాకిస్తాన్ జైలులో పలు ఇబ్బందులు పడ్డాను. పాక్ జైలు నుంచి నా దేశానికి తిరిగి రావడం స్వర్గానికి తిరిగివచ్చినట్లుందని హసీనాబేగం చెప్పారు. తనను స్వదేశానికి తీసుకువచ్చిన ఔరంగాబాద్ పోలీసులకు హసీనా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also… ఎర్రకోట వైపు రైతులను ప్రేరేపించింది ఎవరు..? ఆ హీరోతో ఢిల్లీ ఉద్రిక్తతలకు సంబంధమేంటీ..?