ఏకంగా 644 మంది మిలిటెంట్లు లొంగుబాటు..
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 644 మంది నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన మిలిటెంట్లు లొంగిపోయిన ఆసక్తికర ఘటన గురువారం చోటుచేసుకుంది. అసోంలోని నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన ఉల్ఫా, ఎన్డీఎఫ్బీ, ఆర్ఎన్ఎల్ఎఫ్, కేఎల్ఓ, సీపీఐ(మావోయిస్టు).. మొత్తం ఎనిమిది సంస్థలకు చెందిన మిలిటెంట్లు సీఎం సర్పనంద సోనోవాల్ సమక్షంలో.. వారి వద్ద ఉన్న 177 ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ సందర్భంగా.. రాష్ట్రానికి, అసోం పోలీసులకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆయుధాలను […]
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 644 మంది నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన మిలిటెంట్లు లొంగిపోయిన ఆసక్తికర ఘటన గురువారం చోటుచేసుకుంది. అసోంలోని నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన ఉల్ఫా, ఎన్డీఎఫ్బీ, ఆర్ఎన్ఎల్ఎఫ్, కేఎల్ఓ, సీపీఐ(మావోయిస్టు).. మొత్తం ఎనిమిది సంస్థలకు చెందిన మిలిటెంట్లు సీఎం సర్పనంద సోనోవాల్ సమక్షంలో.. వారి వద్ద ఉన్న 177 ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ సందర్భంగా.. రాష్ట్రానికి, అసోం పోలీసులకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆయుధాలను విడనాడి.. మిలిటెంట్ గ్రూప్లకు చెందిన నాయకులు జనజీవన స్రవంతిలో కలవడం శుభపరిణామమన్నారు.
Guwahati: 644 cadres of 8 militant groups today surrendered at the Arms Laying Down Ceremony, in presence of Assam Chief Minister Sarbananda Sonowal. pic.twitter.com/jz5Tls7ApN
— ANI (@ANI) January 23, 2020