ట్రాక్టర్, ట్యాంకర్ ఢీ.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రాష్ట్రంలోని సీతాపూర్ పట్టణం, తేడ్వా చిల్లవులా ప్రాంతంలో ఓ ట్యాంకర్, ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారుల. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు […]

ట్రాక్టర్, ట్యాంకర్ ఢీ.. ఆరుగురు మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 18, 2019 | 7:10 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రాష్ట్రంలోని సీతాపూర్ పట్టణం, తేడ్వా చిల్లవులా ప్రాంతంలో ఓ ట్యాంకర్, ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారుల. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.