ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 527..
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్లాక్ 1.0 తర్వాత రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో..
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్లాక్ 1.0 తర్వాత రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,624కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 6,703 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 48 మంది మరణించారు.
527 new COVID19 positive cases reported in Odisha in the last 24 hours. The total number of positive cases in the state is now 10,624 including 3,860 active cases, 6,703 recovered and 48 deaths: Odisha Health Department
— ANI (@ANI) July 8, 2020
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నాటికి 7.42 లక్షలకు పైగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4.5 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది