కారు, లారీ ఢీ.. ఐదుగురు మృతి..
వరంగల్ జిల్లా కాజీపేటలో విషాదం నెలకొంది. దేవుడి దర్శనానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. వరంగల్ జిల్లాలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. స్వామి దర్శనానంతరం తిరిగి స్వస్థలానికి బయలు దేశారు. రంగారెడ్డి జిల్లా సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి.. పలుగురాయి లోడుతో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. దుర్గాప్రసాద్, శాంతన్, రాజుల […]
వరంగల్ జిల్లా కాజీపేటలో విషాదం నెలకొంది. దేవుడి దర్శనానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. వరంగల్ జిల్లాలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. స్వామి దర్శనానంతరం తిరిగి స్వస్థలానికి బయలు దేశారు. రంగారెడ్డి జిల్లా సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి.. పలుగురాయి లోడుతో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. దుర్గాప్రసాద్, శాంతన్, రాజుల మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. విజయలక్ష్మీ, పద్మలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక డ్రైవర్ అలీద్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.