పోలీసుల ఎదుట లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ నక్సల్స్..
ఛత్తీస్గఢ్లో పోలీసుల ఎదుట ఐదుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లు అని తేలింది. సుక్మా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్లో పోలీసుల ఎదుట ఐదుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లు అని తేలింది. సుక్మా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల ఎదుట ఆయుధాలతో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది. సుక్మా జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన ఐదుగురు నక్సలైట్లలో ఇద్దరు నక్సలైట్లు మోస్ట్ వాంటెడ్ వారని తెలిపారు. వారిపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు కూడా తెలిపారు. ఇదిలావుంటే.. జూన్ 8వ తేదీన 7 ఐఈడీ బాంబులను సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ పోలీసులు నిర్వీర్యం చేశారు. వీటిని నక్సలైట్లు అమర్చినట్లు గుర్తించారు.