కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..

కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓమ్నీ కారు ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం కేరళలోని వలయార్‌కు వెళుతుండగా పాలక్కాడ్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మరికాసేపట్లో గమ్యస్థానం చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ మహిళ, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన పాలక్కడ్ ఆసుపత్రికి తరలించారు.

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 8:41 PM

కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓమ్నీ కారు ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం కేరళలోని వలయార్‌కు వెళుతుండగా పాలక్కాడ్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మరికాసేపట్లో గమ్యస్థానం చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ మహిళ, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన పాలక్కడ్ ఆసుపత్రికి తరలించారు.