దారుణం.. ఒకే గదిలో 60 ఆవులు.. ఊపిరాడక 43 మృతి..
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. బిలాస్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 60 ఆవులను ఒకే గదిలో బంధించారు. దీంతో అందులో 43 ఆవులు ఊపిరాడక ప్రాణాలు విడిచాయి. ఈ దారుణ ఘటన జిల్లాలోని తాఖత్పూర్..
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. బిలాస్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 60 ఆవులను ఒకే గదిలో బంధించారు. దీంతో అందులో 43 ఆవులు ఊపిరాడక ప్రాణాలు విడిచాయి. ఈ దారుణ ఘటన జిల్లాలోని తాఖత్పూర్ బ్లాక్ పరిధిలోని మెడ్పర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని పంచాయితీ కార్యాలయానికి సంబంధించిన ఓ రూం నుంచి దుర్వాసన వస్తుండటం గమనించిన స్థానికులు.. వెంటనే ఆ గదిలో ఏం ఉందోనని తలుపులు పగలగొట్టి లోపల చూసి షాక్కు గురయ్యారు. ఆ గదిలో పెద్ద ఎత్తున ఆవులను బంధించి ఉంచడాన్ని గమనించారు. ఏకంగా 60 ఆవులను ఒకే గదిలో బంధించడంతో.. వాటికి ఊపిరి ఆడకపోయింది. దీంతో అందులో 43 ఆవులు ప్రాణాలు విడిచాయి. గ్రామస్థులు గమనించకపోతే.. మిగతా 17 ఆవులు పరిస్థితి ఏమయ్యేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడంతో.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, ఘటనపై బిలాస్పూర్ జిల్లా కలెక్టర్ మిట్టర్ విచారం వ్యక్తం చేశారు. ఆవులను గదిలో ఎవరు బంధించారు..? ఎప్పుడు బంధించారు..? ఎందుకు బంధించారు..? అన్న కోణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. ఘటనపై అనిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు.