మాస్కోలో విమాన ప్రమాదం.. 41 మంది మృతి
రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం అత్యవసరంగా దిగిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ 100 విమానం మాస్కో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో.. పైలట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో […]
రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం అత్యవసరంగా దిగిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది.
రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ 100 విమానం మాస్కో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో.. పైలట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. 78 మంది విమానంలో ఉండగా.. చాలామంది అత్యవసర ద్వారాల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు రష్యా మీడియా ప్రకటించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Спасатели сообщают, что все 78 пассажиров горящего самолёта в Шереметьево эвакуированы, пострадали всего пять человек. Это какое-то невероятное чудо! pic.twitter.com/0CCyMRxcSH
— Дмитрий Смирнов (@dimsmirnov175) May 5, 2019