బ్రదర్తో ట్రబుల్.. మాయావతికి ఐటీ దెబ్బ..
బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్ను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఏడు ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ నోయిడాలో ఉంది. ఢిల్లీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్.. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్తో పాటు ఆయన భార్య లతకు ఈ నెల 16న నోటీసులు జారీ చేయగా.. ఇవాళ అమలు చేశారు. ఆనంద్ కుమార్తో పాటు ఆయన భార్య […]
బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్ను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఏడు ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ నోయిడాలో ఉంది. ఢిల్లీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్.. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్తో పాటు ఆయన భార్య లతకు ఈ నెల 16న నోటీసులు జారీ చేయగా.. ఇవాళ అమలు చేశారు. ఆనంద్ కుమార్తో పాటు ఆయన భార్య లతకు చెందిన న్యూఢిల్లీ, నోయిడా పరిధిలోని ఆస్తులను కూడా జప్తు చేశారు. కాగా, ఆనంద్ను బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా మాయావతి నియమించారు.