వరుస పేలుళ్లతో వణికిన నేపాల్..
నేపాల్లో బాంబుల మోతతో దద్ధరిల్లింది. మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖాఠ్మండులోని సుకేధర, ఘట్టెకు, నాగ్ధుందా ప్రాంతాల్లో పేలుళ్లు వణికించాయి. ఘట్టెకు నగరంలో జనావాసాల మధ్య బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండో పేలుడు సుకేధరలోని ఓ సెలూన్ షాపులో జరిగింది. పేలుళ్ల ధాటికి సమీపంలోని గోడలు సైతం బీటలు వారాయి. నేపాల్ పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తున్న 9 మందిని పోలీసులు […]
నేపాల్లో బాంబుల మోతతో దద్ధరిల్లింది. మూడు వేర్వేరు బాంబు పేలుళ్లలో నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖాఠ్మండులోని సుకేధర, ఘట్టెకు, నాగ్ధుందా ప్రాంతాల్లో పేలుళ్లు వణికించాయి.
ఘట్టెకు నగరంలో జనావాసాల మధ్య బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండో పేలుడు సుకేధరలోని ఓ సెలూన్ షాపులో జరిగింది. పేలుళ్ల ధాటికి సమీపంలోని గోడలు సైతం బీటలు వారాయి.
నేపాల్ పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో ఆర్మీ మోహరించింది. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 9 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.