Rafale Aircraft: భారత్కు చేరుకున్న బాహుబలి యుద్ధ విమానాలు… ఫ్రాన్స్ నుంచి ఎన్ని వచ్చాయంటే..?
బాహుబలి యుద్ధ విమానాలు భారత్ చేరాయి. అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు...
బాహుబలి యుద్ధ విమానాలు భారత్ చేరాయి. అత్యాధునిక యుద్ధ విమానాలైన 36 రాఫెల్స్ను రూ.59 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం చేసుకున్నది. గత ఏడాది జూలై 29న తొలి బ్యాచ్గా ఐదు రాఫెల్స్ పంజాబ్లోని అంబాలా ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాటిని లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు.
గత ఏడాది నవంబర్లో రెండో బ్యాచ్ కింద మూడు రాఫెల్స్ జామ్నగర్ ఎయిర్ బేస్కు చేరాయి. తాజాగా మూడో బ్యాచ్ కింద మరో మూడు రాఫెల్స్ బుధవారం రాత్రికి జామ్నగర్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యాయి. వీటి రాకతో ఐఏఎఫ్లో రాఫెల్స్ సంఖ్య 11కు చేరింది. శత్రు దేశాల రాడార్లకు వీటి ఆచూకీ చిక్కకపోవడం, యూఏఈ ఎంఆర్టీటీ ద్వారా గాలిలోనే ఇంధనం నింపుకోవడం, వేల కిలోమీటర్లు ప్రయాణించడం వీటిలోని ప్రధాన ప్రత్యేకతలు.