తమిళనాడులో కరోనా విలయ తాండవం.. 90 వేలకు పైగా కేసులు..
కరోనా మహమ్మారి తమిళనాడులో విలయ తాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 90 వేల మార్క్ దాటేసింది. తాజాగా మంగళవారం నాడు కొత్తగా..
కరోనా మహమ్మారి తమిళనాడులో విలయ తాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 90 వేల మార్క్ దాటేసింది. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 3,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,617కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 38,889 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 60 మంది మరణించారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 50,074 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు లక్షల మార్కును దాటేసింది.
3,943 fresh #COVID19 positive cases and 60 deaths have been reported in Tamil Nadu today. Total number of cases rise to 90,167 including 38,889 active cases, 50,074 discharged cases and 1,201 deaths: State Health Department pic.twitter.com/1O4KC8VmMi
— ANI (@ANI) June 30, 2020