53 దేశాల్లో.. 3,336 మంది భారతీయులకు కరోనా.. 25 మంది మృతి..

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల లక్షా 32 వేల మందికిపైగా మృతి చెందారు. 53 దేశాల్లో 3,336 మంది

53 దేశాల్లో.. 3,336 మంది భారతీయులకు కరోనా.. 25 మంది మృతి..
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2020 | 7:41 PM

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల లక్షా 32 వేల మందికిపైగా మృతి చెందారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 25 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు దేశాల్లో 3,336 మంది భారతీయులు కరోనా వైరస్ బారిన పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది.

కాగా.. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన 55 దేశాలకు మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్ నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కరోనావైరస్ తో పోరాడటానికి జర్మనీ, యుఎస్, యుకె, మలేషియా, జపాన్, ఫ్రాన్స్ నుండి వైద్య పరికరాలను సేకరించే దిశగా భారత్ చూస్తోందని అధికారులు తెలిపారు.