చైనాలో భూకంపం.. 31 మందికి గాయాలు
చైనాలోని గంగ్ష్యాన్ ప్రావిన్స్ను భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైంది. సోమవారం సంభవించిన ఈ కంపానికి 31 మందికి తీవ్ర గాయాలైనట్టు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భూకంపం తీవ్రత బట్టి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకంపనలు భారీ స్థాయిలో ఉండటంతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా.. ఒక వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో భూకంపానికి […]
చైనాలోని గంగ్ష్యాన్ ప్రావిన్స్ను భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైంది. సోమవారం సంభవించిన ఈ కంపానికి 31 మందికి తీవ్ర గాయాలైనట్టు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భూకంపం తీవ్రత బట్టి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకంపనలు భారీ స్థాయిలో ఉండటంతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా.. ఒక వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో భూకంపానికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.