దారుణం: చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ..

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దవూర మండలం చిన్నగూడెంలో ఒక మేనమామ పాశవికంగా ప్రవర్తించాడు. చిన్నారి అని కూడా దయలేకుండా కాళ్లు పట్టి బండకు కొట్టి హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. చిన్నారి తల్లిదండ్రులు గుంటూరు జిల్లా గొట్టిముక్కల గ్రామంలో నివసిస్తున్నారు. పాప తల్లి లక్ష్మీ డెలివరీ కోసం సొంతూరు చిన్నగూడానికి వచ్చింది. నాలుగు నెలల తర్వాత తిరిగి వెళిపోదామనుకున్నారు. ఇంతలోనే ఏం జరిగింతో తెలియదు మేనమామ ఉపేందర్ చిన్నారని చంపేశాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. […]

దారుణం: చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ..
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 11:16 AM

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దవూర మండలం చిన్నగూడెంలో ఒక మేనమామ పాశవికంగా ప్రవర్తించాడు. చిన్నారి అని కూడా దయలేకుండా కాళ్లు పట్టి బండకు కొట్టి హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. చిన్నారి తల్లిదండ్రులు గుంటూరు జిల్లా గొట్టిముక్కల గ్రామంలో నివసిస్తున్నారు. పాప తల్లి లక్ష్మీ డెలివరీ కోసం సొంతూరు చిన్నగూడానికి వచ్చింది. నాలుగు నెలల తర్వాత తిరిగి వెళిపోదామనుకున్నారు. ఇంతలోనే ఏం జరిగింతో తెలియదు మేనమామ ఉపేందర్ చిన్నారని చంపేశాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అభం శుభం తెలియని పసిపాపను పొట్టనబెట్టుకున్నాడని కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఉపేందర్‌ను పోలీసులకు అప్పగించారు. ఇంట్లోవాళ్లను డబ్బులు కావాలని ఉపేందర్ డిమాండ్ చేస్తూ ఉండేవాడని.. వాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతోనే మద్యం తాగి ఆ మత్తులో చిన్నారని చంపేసి ఉంటాడని వారు చెబుతున్నారు. గతంలో కూడా ఉపేందర్ సైకోలా ప్రవర్తించే వాడని అంటున్నారు.