కాశ్మీర్ లోయలో ఉగ్ర వేట..8 మంది టెర్రరిస్టులు హతం..
జమ్ముకాశ్మీర్లో టెర్రరిస్టుల కోసం భారీ ఆపరేషన్ను చేపట్టాయి భారత భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్లలో వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 8మంది ఉగ్రవాదులను హతమార్చాయి భారత బలగాలు.
జమ్ముకాశ్మీర్లో టెర్రరిస్టుల కోసం భారీ ఆపరేషన్ను చేపట్టాయి భారత భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్లలో వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 8మంది ఉగ్రవాదులను హతమార్చాయి భారత బలగాలు.
పుల్వామా జిల్లా పొంపోర్ మీజ్ ప్రాంతంలో గురువారం ఒక ముష్కరుడిని హతమార్చిన భద్రతా సిబ్బంది.. ఇవాళ మరో ఇద్దరిని అంతమొందించారు. మసీదుల్లో దాక్కున్న ముష్కరులను వేటాడి మరీ చంపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు షోపియాన్ జిల్లా మునాంద్ ఏరియాలోనూ భారత ఆర్మీ ఆపరేషన్ గురువారం నుంచి కొనసాగుతోంది. ఇక్కడ గురువారం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఇవాళ మరో నలుగురుని హతమార్చగా.. ఈ ఆపరేషన్లో మొత్తం ఐదుగురు ముష్కరులు అంతమయ్యారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.