కాశ్మీర్​ లోయలో ఉగ్ర వేట..8 మంది టెర్ర‌రిస్టులు హతం..

జమ్ముకాశ్మీర్​లో టెర్ర‌రిస్టుల కోసం భారీ ఆపరేషన్​ను చేపట్టాయి భార‌త‌ భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్​లలో వేర్వేరు చోట్ల ఎన్​కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 8మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చాయి భార‌త బ‌ల‌గాలు.

కాశ్మీర్​ లోయలో ఉగ్ర వేట..8 మంది టెర్ర‌రిస్టులు హతం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 19, 2020 | 11:17 AM

జమ్ముకాశ్మీర్​లో టెర్ర‌రిస్టుల కోసం భారీ ఆపరేషన్​ను చేపట్టాయి భార‌త‌ భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్​లలో వేర్వేరు చోట్ల ఎన్​కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 8మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చాయి భార‌త బ‌ల‌గాలు.

పుల్వామా జిల్లా పొంపోర్​ మీజ్​ ప్రాంతంలో గురువారం ఒక ముష్కరుడిని హతమార్చిన భద్రతా సిబ్బంది.. ఇవాళ మరో ఇద్దరిని అంతమొందించారు. మసీదుల్లో దాక్కున్న ముష్క‌రుల‌ను వేటాడి మరీ చంపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు షోపియాన్​ జిల్లా మునాంద్​ ఏరియాలోనూ భార‌త‌ ఆర్మీ ఆపరేషన్​ గురువారం నుంచి కొనసాగుతోంది. ఇక్కడ గురువారం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఇవాళ మరో న‌లుగురుని హతమార్చగా.. ఈ ఆపరేషన్​లో మొత్తం ఐదుగురు ముష్కరులు అంత‌మ‌య్యారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.