రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం జాదిబల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహించాయి. అయితే వీరిని గమనించిన ఉగ్రవాదులు.. కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. […]
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం జాదిబల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహించాయి. అయితే వీరిని గమనించిన ఉగ్రవాదులు.. కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక మరో ఎన్కౌంటర్ షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. దీంతో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, జాదిబల్ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాది.. గత నెల బీఎస్ఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడ్డ వాడిగా గుర్తించారు.