బ్రేకింగ్: స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు చిన్నారులు మృతి
వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్లలోని వాగేశ్వర స్కూల్ వ్యాన్ బోల్తా పడి.. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 26 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. […]
వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్లలోని వాగేశ్వర స్కూల్ వ్యాన్ బోల్తా పడి.. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 26 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలతో అంబేద్కర్ చౌక్ దగ్గర తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఈటల.. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.