చంద్రుడికి మరింత చేరువలో చంద్ర‌యాన్-2

యావత్ భారతదేశం గర్వపడేలా ఇండియన్ సైంటిస్టులు నిర్వహించిన మిషన్ మూన్ ప్రయోగం నుంచి లేటెస్ట్ అబ్డేట్ వచ్చింది.  ఈ నెల 22న అంతరిక్షంలోకి  ఇస్రో ప్రయోగించిన  చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడ‌వ‌సారి పెంచారు సైంటిస్టులు.  శుక్ర‌వారం తెల్లవారు జామున విజయవంతంగా రెండో ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత  ఇవాళ మ‌ధ్యాహ్నం 3.12 నిమిషాల‌కు మూడ‌వ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టారు. సుమారు 989 నిమిషాల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది. ఆ త‌ర్వాత చంద్ర‌యాన్‌-2 వాహ‌క‌నౌక 276 […]

చంద్రుడికి మరింత చేరువలో చంద్ర‌యాన్-2
Follow us

|

Updated on: Jul 30, 2019 | 2:23 AM

యావత్ భారతదేశం గర్వపడేలా ఇండియన్ సైంటిస్టులు నిర్వహించిన మిషన్ మూన్ ప్రయోగం నుంచి లేటెస్ట్ అబ్డేట్ వచ్చింది.  ఈ నెల 22న అంతరిక్షంలోకి  ఇస్రో ప్రయోగించిన  చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడ‌వ‌సారి పెంచారు సైంటిస్టులు.  శుక్ర‌వారం తెల్లవారు జామున విజయవంతంగా రెండో ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత  ఇవాళ మ‌ధ్యాహ్నం 3.12 నిమిషాల‌కు మూడ‌వ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టారు. సుమారు 989 నిమిషాల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది. ఆ త‌ర్వాత చంద్ర‌యాన్‌-2 వాహ‌క‌నౌక 276 x 71792 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో చంద్రుడికి చంద్ర‌యాన్ మ‌రింత చేరువైంది. చంద్ర‌యాన్ వ్యోమ‌నౌక అన్ని ప్యారామీట‌ర్ల‌తో స‌హ‌జంగా వెళ్తున్న‌ట్లు ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆగ‌స్టు 2వ తేదీన వ్యోమ‌నౌక‌కు చెందిన నాలుగ‌వ భూక‌క్ష్య పెంపు ప్రక్రియ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజున మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల మ‌ధ్య ఈ ప్ర‌క్రియ ఉంటుంద‌ని ఇస్రో చెప్పింది. ఆగస్టు 14 వరకు మిగిలిన‌ కక్ష్యలను పెంచే ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది.