దేశ రాజధాని ఆస్పత్రిలో కరోనా కలకలం..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా,పెద్ద, కులం,మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా.. అందర్నీ టచ్ చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కరోనా టెన్షన్ మొదలైంది. ఆస్పత్రి సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో.. కలకలం రేపుతోంది. లోక్నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మెడికల్ డైరెక్టర్తో పాటు.. మరో ఇద్దరికి కరోనా సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి.. […]
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా,పెద్ద, కులం,మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా.. అందర్నీ టచ్ చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కరోనా టెన్షన్ మొదలైంది. ఆస్పత్రి సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో.. కలకలం రేపుతోంది. లోక్నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మెడికల్ డైరెక్టర్తో పాటు.. మరో ఇద్దరికి కరోనా సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నామని.. వారి కాంటాక్ట్లోకి వచ్చిన వారిని క్వారంటైన్ పంపుతున్నామని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. మహారాష్ట్రలో పోలీసులకు కరోనా సోకుతుండటం షాక్కు గురిచేస్తోంది. ఇప్పటికే అక్కడ రెండు వేల మంది సిబ్బందికి పైగా కరోనా సోకగా.. ఇరవై మందికి పైగా మరణించారు.