రైల్వే ట్రాక్పై మృతదేహాలు.. పక్కనే ఏడుస్తూ ఓ బాలుడు..
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మండ్వాలీ రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై మూడు మృతదేహాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదం జరిగిందా..
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మండ్వాలీ రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై మూడు మృతదేహాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదం జరిగిందా..? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్నది తెలియడం లేదు. అయితే ఆ మృతదేహాల పక్కనే ఓ బాలుడు స్వల్ప గాయాలతో ఏడుస్తూ కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. అటు రైల్వే అధికారులతో పాటు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయాలతో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మూడు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.