28 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన కరోనా మహమ్మారి

యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. క్రమక్రమంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడ ఓ 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల వ్యవధిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఈ వ్యాపారులకు కరోనా వైరస్.. ఎలా సోకిందన్న దానిని గుర్తించేందుకు పోలీసులు, పలువురు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఈ ప్రాంతాల్లో […]

28 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన కరోనా మహమ్మారి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 10:59 PM

యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. క్రమక్రమంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడ ఓ 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల వ్యవధిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఈ వ్యాపారులకు కరోనా వైరస్.. ఎలా సోకిందన్న దానిని గుర్తించేందుకు పోలీసులు, పలువురు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా టెస్టులు చేయగా.. వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ తేలిందని ఆగ్రా ఎస్పీ తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన కూరగాయల వ్యాపారులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

కాగా.. యూపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.