ఆ మురికివాడలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. తాజాగా మరో 25..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ముంబైలోని ధారవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడి చిన్న చిన్న గల్లీలతో పాటు.. ప్రజల జీవన విధానం చాలా భిన్నంగా ఉంఉటుంది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ముంబైలోని ధారవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడి చిన్న చిన్న గల్లీలతో పాటు.. ప్రజల జీవన విధానం చాలా భిన్నంగా ఉంఉటుంది. ఇక దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో.. ఈ ధారవిలో కరోనా సోకడంతో.. అక్కడి ప్రజలతో పాటు అధికారులు టెన్షన్కు గురయ్యారు. ఈ ప్రాంతంలో కరోనా వస్తే.. అరికట్టడం తీవ్ర కష్టమని అంతా అనుకున్నారు. అనుకున్నట్లు గానే ఇక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో మంగళవారం ఇక్కడ మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,830కి చేరింది. ఈ విషయాన్ని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వెల్లడించింది. ఇక ఈ ధారవి ప్రాంతంలో కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 71కి చేరింది. ఇదిలావుంటే.. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య డెబ్బై వేలకు చేరింది. వీటిలో 37 వేలకు పైగా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.