ఏపీలో క‌రోనాపై ఇది శుభ‌వార్తే..ఒక్క‌రోజే ఆ జిల్లానుంచి 24 మంది డిశ్చార్జ్

క‌రోనా వైరస్ వీర‌విహారం చేస్తుండ‌టంతో విలవిల్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రజలకు శనివారం కాస్త ఊరట క‌లిగించే వార్త అందింది. జిల్లాలో కోవిడ్-19 మహమ్మారి సోకిన మరో 24 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో శనివారం వారిని విశ్వభారతి కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు సార్లు టెస్టుల‌ చేసిన అనంతరం నెగిటివ్ రిజ‌ల్ట్ రావడంతో వారిని శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డాక్ట‌ర్ల‌ సాయంతో కరోనాపై వారి పోరాటం ఫ‌లించిన‌ట్టే లెక్క‌. […]

ఏపీలో క‌రోనాపై ఇది శుభ‌వార్తే..ఒక్క‌రోజే ఆ జిల్లానుంచి  24 మంది డిశ్చార్జ్
Follow us

|

Updated on: Apr 25, 2020 | 11:17 PM

క‌రోనా వైరస్ వీర‌విహారం చేస్తుండ‌టంతో విలవిల్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రజలకు శనివారం కాస్త ఊరట క‌లిగించే వార్త అందింది. జిల్లాలో కోవిడ్-19 మహమ్మారి సోకిన మరో 24 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో శనివారం వారిని విశ్వభారతి కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం రెండు సార్లు టెస్టుల‌ చేసిన అనంతరం నెగిటివ్ రిజ‌ల్ట్ రావడంతో వారిని శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డాక్ట‌ర్ల‌ సాయంతో కరోనాపై వారి పోరాటం ఫ‌లించిన‌ట్టే లెక్క‌. ఒకే రోజు 24 మంది డిశ్చార్జి కావడంతో కర్నూలు జిల్లా ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వీరితో క‌లిపి ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో మొత్తం 31 మంది కరోనా నుంచి కోరుకోని క్షేమంగా డిశ్చార్జి అయ్యారు.

కాగా డిశ్చార్జి అయిన 24 మందికి సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకు కలెక్టర్‌ వీరపాండియన్‌, స్టేట్‌ కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అజయ్‌ జైన్‌, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌లు ఒక్కొక్కరికి రూ. 2 వేల నగదు, పండ్ల కిట్లను అందించి స్పెష‌ల్ వెహిక‌ల్స్ లో వారిని ఇళ్ల వ‌ద్ద దించారు.

శనివారం క‌ర్నూలు జిల్లాలో డిశ్చార్జి అయిన వారి వివరాలు:

కర్నూలు నగరం- 7, నంద్యాల- 7, పాణ్యం- 2, సిరవేళ్ల- 2, నందికొట్కూరు- 2, గడివేముల- 1, రుద్రవరం- 1, ఆత్మకూరు- 1, డోన్‌-1.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??