వీవీప్యాట్‌ స్లిప్పులపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి సుప్రీం తలుపుతట్టాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 21 పార్టీలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి.  గతంతో ఇదే ప్రతిపాదనతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని […]

వీవీప్యాట్‌ స్లిప్పులపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌
Follow us

|

Updated on: Apr 24, 2019 | 4:08 PM

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి సుప్రీం తలుపుతట్టాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 21 పార్టీలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి.  గతంతో ఇదే ప్రతిపాదనతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పార్టీలు.. మరోసారి రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి.