త్వరలో షాకింగ్ న్యూస్.. 2వేల నోటు రద్దు !

త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా ? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోందంటున్నారు ఆర్థిక నిఫుణులు, బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయ్యి శుక్రవారానికి సరిగ్గా మూడేళ్ళు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థల్లో తమ తమ విశ్లేషణలను పంచుకున్న ఆర్థిక వేత్తలు త్వరలో 2 వేల నోటు రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తుందని చెబుతున్నారు. బ్యాంకుల్లో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ దిశగానే కొనసాగుతున్నాయని బ్యాంకింగ్ రంగ […]

త్వరలో షాకింగ్ న్యూస్.. 2వేల నోటు రద్దు !
Follow us

|

Updated on: Nov 09, 2019 | 9:31 AM

త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా ? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోందంటున్నారు ఆర్థిక నిఫుణులు, బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయ్యి శుక్రవారానికి సరిగ్గా మూడేళ్ళు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థల్లో తమ తమ విశ్లేషణలను పంచుకున్న ఆర్థిక వేత్తలు త్వరలో 2 వేల నోటు రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తుందని చెబుతున్నారు. బ్యాంకుల్లో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ దిశగానే కొనసాగుతున్నాయని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

8 నవంబర్, 2016న రాత్రి 8 గం.లకు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటన ఏ ఒక్క భారతీయుని మదిలోంచి ఇంకా చెదిరిపోలేదు. దాదాపు ఆరు నెలల పాటు ప్రతీ సగటు భారతీయుడు నోట్ల రద్దుతో పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ఆ తర్వాత సామాన్యులకు సమస్యలు తప్పినా… దేశ ఆర్థిక రంగంపై మాత్రం నోట్ల రద్దు ప్రభావం ఇంకా కొనసాగుతూనే వుంది. మూడేళ్ళు పూర్తయినా.. భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో వుండడానికి ఆనాటి నోట్ల రద్దే కారణమని ఆర్థిక వేత్తల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో మరోసారి రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తారంటూ పెద్దగా ప్రచారం మొదలైంది. ఈ రద్దును పలువురు ఆర్థిక వేత్తలు, బ్యాంకింగ్ నిఫుణులు ఎండార్స్ చేస్తున్నారు. అయితే.. ఈ రద్దు ఆనాటి నోట్ల రద్దులాగా ఒకేసారి దేశంలో విధించబోరని.. క్రమంగా 2 వేల రూపాయల నోటును బ్యాంకులకు పరిమితం చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీలో వున్న కరెన్సీలో 2 వేల రూపాయల నోటు వాటా దాదాపు మూడో వంతు వుంటుంది. ఉదాహరణకు దేశంలో చెలామణీలో వున్న నగదు మొత్తం 24 లక్షల కోట్లు (కాస్త అటూ ఇటూగా) అనుకుంటే అందులో 8 లక్షల కోట్లు 2 వేల రూపాయల నోట్లే.

ఇప్పుడు ఈ నోట్లను పెద్ద ఎత్తున నిల్వ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, క్రమంగా 2 వేల రూపాయల నోటు నల్లధనం దాచుకునే వారికి ఉపయోగకరంగా మారుతోందని ఆర్బీఐ వర్గాలు అంఛనా వేస్తున్నాయి. అందుకే 2 వేల రూపాయల నోటును క్రమంగా బ్యాంకులకే పరిమితం చేయాలని సూచిస్తున్నారు. బ్యాంకులకు తిరిగి వచ్చే రెండు వేల రూపాయల నోటును తిరిగి ఖాతాదారులకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇలా చెలామణీలో వున్న నోట్లలో 80-90 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిన తర్వాత ఆర్బీఐ రంగంలోకి దిగి ఆ నగదును చిన్న 100, 200, 500 నోట్లతో కవర్ చేయాలని సూచిస్తున్నారు బ్యాంకింగ్ రంగ ఎక్స్‌పర్ట్స్‌.

ఈ సూచనకు ప్రధాన కారణం మన దేశం డిజిటల్ మనీ వినియోగంలో చాలా వెనకబడి వుండడమేనంటున్నారు. ఫలితంగా దేశంలో ఇప్పటికీ 85 శాతం నగదు లావాదేవీలే జరుగుతున్నాయని, దాంతో మళ్ళీ బ్లాక్ మనీ పెరిగిపోతుందని చెబుతున్నారు. ఈ నల్లధనాన్ని పెద్ద ఎత్తున దాచుకోవడానికి 2 వేల రూపాయల నోటు బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో డిజిటల్ మనీ వినియోగాన్ని పెంచడంతోపాటు నల్లధనాన్ని అరికట్టేందుకు 2 వేల రూపాయల సర్క్యులేషన్‌ని తగ్గించడమే ఉపయోగమని అంటున్నారు.

చైనాలో డిజిటల్ మనీ 87 శాతం కాగా.. మన దేశంలో ఇది 15 శాతం మాత్రమే. సో.. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు.. అంటే.. డిజిటల్ మనీ సర్క్యులేషన్‌ని పెంచడం, నల్లధనానికి చెక్ పెట్టడం.. ఇలా రెండు పనులు 2 వేల రూపాయల నోటు సర్క్యులేషన్‌ని తగ్గించడం వల్ల సాధ్యమవుతాయని అంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎన్.సి.గార్గ్ ఈ మేరకు చేసిన సూచనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.