తిరుమల శ్రీవారికి భారీ విరాళం!
అమెరికాలో నివసించే ఇద్దరు ప్రవాస భారతీయ వ్యాపారులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రూ.14 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించినట్టు తితిదే అధికారులు తెలిపారు. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు స్నేహితులు కుటుంబసమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రూ.14 కోట్ల విలువైన ఓవర్ డిమాండ్ డ్రాఫ్ట్ను ఆలయ ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కానుక మొత్తాన్ని తితిదే నిర్వహిస్తున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని వారు కోరారు. వీరిద్దరూ భారీ మొత్తంలో […]
అమెరికాలో నివసించే ఇద్దరు ప్రవాస భారతీయ వ్యాపారులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రూ.14 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించినట్టు తితిదే అధికారులు తెలిపారు. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు స్నేహితులు కుటుంబసమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రూ.14 కోట్ల విలువైన ఓవర్ డిమాండ్ డ్రాఫ్ట్ను ఆలయ ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కానుక మొత్తాన్ని తితిదే నిర్వహిస్తున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని వారు కోరారు. వీరిద్దరూ భారీ మొత్తంలో కానుకలు సమర్పించడం మొదటిసారేం కాదు. గతేడాది జులైలోనూ రూ.13.5 కోట్లను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆ మొత్తాన్ని కూడా తితిదే ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు చేపట్టే సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సిందిగా కోరారు.