మనాలీలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్..

హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్‌ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఆదివారం నాడు మనాలీలో నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దర్ని మనాలీలో పట్టుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు అచ్చర్‌ ఖాన్‌, వీరుద్దీన్‌గా గుర్తించారు.

మనాలీలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 8:42 AM

హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్‌ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఆదివారం నాడు మనాలీలో నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దర్ని మనాలీలో పట్టుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు అచ్చర్‌ ఖాన్‌, వీరుద్దీన్‌గా గుర్తించారు. వీరు ఉనా జిల్లాలోని హరోలీ గ్రామానికి చెందిన వారిగా తేలింది. ఓ ట్రక్కులో వీరు నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తుండగా పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఓ ట్రక్కును ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్రక్కులో 16.525 కిలోల పప్పీ హస్క్‌ డ్రగ్స్‌ను గుర్తించారు. పట్టుబడ్డ నిందితులపై సెక్షన్‌ 19 అండ్ 20 నార్కోటిక్‌ డ్రగ్స్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.