ఐఈడీ బ్లాస్ట్..19 మంది ఈసీ అధికారులు హతం
ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి తాలిబన్లు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషన్ అధికారులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కాంధహార్ ప్రావిన్స్లోని ప్రభుత్వ కార్యాలయానికి పేలుడు పదార్ధాలతో వాహనాల్లో వచ్చిన తాలిబన్ ఉగ్రవాదులు వాటిని పేల్చేశారు. ఈ ఘటనలో 19 మంది ఈసీ అధికారులు మరణించారు. ఆఫ్ఘనిస్థాన్లో అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఓటర్లు రిజిస్ట్రేషన్ పనుల్లో ఉండగా ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్లో ఎలక్షన్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో టెర్రరిస్టులు దాడి చేశారు. […]
ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి తాలిబన్లు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషన్ అధికారులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కాంధహార్ ప్రావిన్స్లోని ప్రభుత్వ కార్యాలయానికి పేలుడు పదార్ధాలతో వాహనాల్లో వచ్చిన తాలిబన్ ఉగ్రవాదులు వాటిని పేల్చేశారు. ఈ ఘటనలో 19 మంది ఈసీ అధికారులు మరణించారు.
ఆఫ్ఘనిస్థాన్లో అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఓటర్లు రిజిస్ట్రేషన్ పనుల్లో ఉండగా ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్లో ఎలక్షన్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.