సైన్యం దాడిలో 17 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం
ఆఫ్ఘన్ సైన్యం దాడిలో 17 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 11 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్టర్ బుధవారం నాడు తెలిపారు. నార్తర్న్ ఫర్యాబ్ ప్రావిన్స్లో సైన్యానికి, తాలిబన్..
ఆఫ్ఘన్ సైన్యం దాడిలో 17 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 11 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్టర్ బుధవారం నాడు తెలిపారు. నార్తర్న్ ఫర్యాబ్ ప్రావిన్స్లో సైన్యానికి, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణలో 17 మంది తాలిబన్ ఉగ్రవాదుల మరణించారన్నారు. మంగళవారం నాడు ప్రావిన్స్లోని దవ్లట్ అబాద్, అల్మర్ జిల్లాలో సైన్యంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఈ క్రమంలోనే సైన్యానికి, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, గడిచిన కొద్ది రోజులుగా ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన ఔట్ పోస్టులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు తాలిబన్ ఉగ్రవాదులు. మరోవైపు తాలిబన్ ఉగ్రవాదులను ఆఫ్ఘన్ సైన్యం ఏరిపారేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
Read More
భూమి పూజలో మోదీతో కూర్చోబోతున్న మరో వ్యక్తి.. ఎవరో తెలుసా..?