కేరళ విమాన ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
కేరళలో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దుబాయి్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన ఎక్స్ప్రెస్ విమానం.. రన్వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి..
కేరళలో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దుబాయి్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన ఎక్స్ప్రెస్ విమానం.. రన్వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడిపోయింది. అంతేకాదు.. ఒక్కసారిగా రెండు ముక్కలయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 190 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు విమాన సిబ్బంది కాగా.. మిగతా వారంతా ప్రయాణికులు. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్తో సహా.. మొత్తం పదిహేడు మంది మృతిచెందారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. విమానంలో చిక్కుకుపోయిన పలువురు ప్రయాణికులను రెస్క్యూ టీం సురక్షితంగా బయటకు తీసింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. మోదీ సీఎం పినరయ్ విజయన్కు ఫోన్ చేసి సహాయక చర్యల గురించి ఆరా తీశారు.
శుక్రవారం రాత్రి 7.41 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 190 మంది ఉన్నారు. వీరిలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. మల్లపురం, వయనాడ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
#UPDATE: Death toll in the flight crash landing incident at #Kozhikode rises to 17 including two pilots, according to Air India Express statement. pic.twitter.com/Hh84tDc3pn
— ANI (@ANI) August 7, 2020
Read More :
కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే