బీటెక్ కొత్త కోర్సుల్లో 15,690 సీట్లు.. ఆ రెండు బ్రాంచ్లకు ఫుల్ డిమాండ్..
బీటెక్లో ఈ ఏడాది కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్సు, కృత్రిమ మేధస్సు- మెషీన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సుల్లో 15,690 సీట్లకు
బీటెక్లో ఈ ఏడాది కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు- మెషీన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ అనుమతులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది.
మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిని కొత్త కోర్సులుగా ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.