ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. 151 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు బదిలీలు..
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. మరోవైపు ఏపీలో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు హైకోర్టు బదిలీలు
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. మరోవైపు ఏపీలో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్లు కల్పించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15 లోపు రిలీవ్ కావాలని, 22 లోపు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధికి 2020-21 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా రూ.25 కోట్లు విడుదల చేసింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదుల సంక్షేమం కోసం దీనిని ఖర్చు చేస్తారు.
Also Read: బ్రెజిల్లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..