ఏపీలోని ఆ జిల్లాలో.. 150మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్..!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో కరోనా పేషంట్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. జిల్లాలో 150 మంది కరోనా పాజిటివ్ పేషెంట్ల ఆచూకీ దొరకడం లేదు. ఆధార్ కార్డులలో ఉన్న అడ్రస్లో
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో కరోనా పేషంట్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. జిల్లాలో 150 మంది కరోనా పాజిటివ్ పేషెంట్ల ఆచూకీ దొరకడం లేదు. ఆధార్ కార్డులలో ఉన్న అడ్రస్లో బాధితులు లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. వాళ్లు నమోదు చేసిన ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 300మందికి పైగా బాధితులు తమ అడ్రసులను తప్పుగా ఇచ్చారు.. వారిలో కొందరివి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. కరోనా పాజిటివ్ తేలిన 150మంది కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వారంతా జనాల్లో కలిసిపోతే కొత్త సమస్యలు వస్తాయని అధికారులు టెన్షన్ పడుతున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. వారు కరోనా టెస్టుల సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా కూపీ లాగే పనిలో ఉన్నారు.
Read More:
జగన్ కీలక నిర్ణయం.. బీటెక్ కోర్సుల్లో అప్రెంటిస్షిప్, ఆనర్స్ డిగ్రీ..!
ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీ..!