గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్!

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన వారందరికి 15 గ్రేస్ మార్కులను కలిపి.. అన్ని జిల్లాలోనూ కలిపి మిగిలిపోయిన 40 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్ష రాసి ఉద్యోగం సాధించలేకపోయిన వారందరికి లబ్ది చేకూరే అవకాశం కనిపిస్తోంది. శనివారం నుంచి నియామక ప్రక్రియ మొదలు కానుండగా.. ఈ నిర్ణయం వల్ల వివిధ కేటగిరీల్లో మిగిలిన అనేక ఉద్యోగాలు భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక […]

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్!
Follow us

|

Updated on: Nov 02, 2019 | 12:18 AM

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్ష రాసిన వారందరికి 15 గ్రేస్ మార్కులను కలిపి.. అన్ని జిల్లాలోనూ కలిపి మిగిలిపోయిన 40 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్ష రాసి ఉద్యోగం సాధించలేకపోయిన వారందరికి లబ్ది చేకూరే అవకాశం కనిపిస్తోంది. శనివారం నుంచి నియామక ప్రక్రియ మొదలు కానుండగా.. ఈ నిర్ణయం వల్ల వివిధ కేటగిరీల్లో మిగిలిన అనేక ఉద్యోగాలు భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక అదనపు మార్కులను జతచేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాను రూపొందించే ప్రక్రియను అన్ని జిల్లాల అధికారులు చేపట్టారు.

శనివారం నుంచి అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సోమవారం నియామకపత్రాలను అందజేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇప్పటికే కటాఫ్ మార్కులు తగ్గించిన సంగతి తెలిసిందే.