అమ్మో! ఈ కొండచిలువ బరువు 35 కేజీలు..పొడవు 14.4 అడుగులు
అస్సాంలోని నాగావ్ జిల్లాలో అటవీ అధికారులు మంగళవారం ఒక భారీ కొండచిలువను పట్టుకున్నారు. రాష్ట్ర రాజధాని డిస్పూర్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగావ్ జిల్లాలోని తేయాకు తోటలో ఈ కొండచిలువను గుర్తించారు. దాదాపు 14.4 అడుగుల పొడవు, 35 కేజీల బరువు ఉండటంతో దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని తేయాకు తోటలోని కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
అస్సాంలోని నాగావ్ జిల్లాలో అటవీ అధికారులు మంగళవారం ఒక భారీ కొండచిలువను పట్టుకున్నారు. రాష్ట్ర రాజధాని డిస్పూర్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగావ్ జిల్లాలోని తేయాకు తోటలో ఈ కొండచిలువను గుర్తించారు. దాదాపు 14.4 అడుగుల పొడవు, 35 కేజీల బరువు ఉండటంతో దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని తేయాకు తోటలోని కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.