ఒడిషా 50 వేలకు చేరువైన కరోనా కేసులు
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,341 కరోనా..
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48,796కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 33,020 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,236 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 15,427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 53,601 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,676కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,39,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
1,341 new #COVID19 cases & 1,236 recoveries reported in Odisha. Total number of cases stands at 48,796 cases, including 15,427 actives cases & 33,020 recoveries till date: Information & Public Relations Dept, Govt of Odisha.
— ANI (@ANI) August 11, 2020
Read More :