కబళించిన కంటైనర్.. 13మంది దుర్మరణం
మహారాష్ట్రలోని మల్కాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. 6వ నంబరు జాతీయ రహదారిపై ఓ భారీ కంటైనర్.. మినీ వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో వచ్చిన కంటైనర్.. మినీ వ్యాన్ను ఢీకొట్టింది. దాదాపు 50 మీటర్ల దూరం వరకు వ్యాన్ను లాక్కెళ్లింది. కంటైనర్ కింద చిక్కుకున్న వ్యాన్ నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను […]
మహారాష్ట్రలోని మల్కాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. 6వ నంబరు జాతీయ రహదారిపై ఓ భారీ కంటైనర్.. మినీ వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో వచ్చిన కంటైనర్.. మినీ వ్యాన్ను ఢీకొట్టింది. దాదాపు 50 మీటర్ల దూరం వరకు వ్యాన్ను లాక్కెళ్లింది. కంటైనర్ కింద చిక్కుకున్న వ్యాన్ నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత కంటైనర్ డ్రైవర్ పారిపోయాడని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మృతిచెందిన వారిలో ఆరుగురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బుర్హాన్పూర్ జిల్లా నాగజిరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పనికోసం సొంతూరు నుంచి జలగౌవ్ వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.