చిత్తూరు జిల్లాలో లారీ బీభత్సానికి 120 గొర్రెలు మృతి
చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గొర్రెల మందపై దూసుకెళ్లడంతో దాదాపు 120 గొర్రెలు చనిపోయాయి. వీటికి కాపలాగా ఉన్న కాపరి కూడా చనిపోయాడు. దీంతో.. ఈ ప్రాంతం మొత్తం భయానకంగా మారింది. ఈ సంఘటన పులిచెర్ల మండలం చెరుకువారిపల్లెలో జరిగింది. కలకడ మండలం కదిరయ్య చెరువుకు చెందిన దాసరి అనే గొర్రెల యజమాని.. ఈ గొర్రెల మందను కలకడకు తీసుకెళ్తున్నాడు. రోడ్డుపై అతివేగంగా వచ్చిన […]
చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గొర్రెల మందపై దూసుకెళ్లడంతో దాదాపు 120 గొర్రెలు చనిపోయాయి. వీటికి కాపలాగా ఉన్న కాపరి కూడా చనిపోయాడు. దీంతో.. ఈ ప్రాంతం మొత్తం భయానకంగా మారింది. ఈ సంఘటన పులిచెర్ల మండలం చెరుకువారిపల్లెలో జరిగింది. కలకడ మండలం కదిరయ్య చెరువుకు చెందిన దాసరి అనే గొర్రెల యజమాని.. ఈ గొర్రెల మందను కలకడకు తీసుకెళ్తున్నాడు. రోడ్డుపై అతివేగంగా వచ్చిన లారీ ఆపకుండా.. గొర్రెల మంద నుంచి దూసుకెళ్లాడు.
120 గొర్రెలు స్పాట్లోనే చనిపోవడంతో ఈ కుటుంబం బోరున విలపిస్తోంది. స్పాట్కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.