కరోనాపై రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో గుడ్ న్యూస్ పంచుకున్న కేటీఆర్…

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో కరోనా సోకిన 11 మంది వ్య‌క్తులకు..తాజా పరీక్ష‌ల్లో నెగ‌టివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని వెల్లడించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్ర‌జ‌ల‌తో ఓ చిన్న శుభ‌వార్త షేర్ చేసుకుంటున్నాను. రాష్ట్రంలో గతంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 11 మందికి నేడు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది’ అని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా […]

కరోనాపై రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో గుడ్ న్యూస్ పంచుకున్న కేటీఆర్...
Follow us

|

Updated on: Mar 29, 2020 | 6:41 PM

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో కరోనా సోకిన 11 మంది వ్య‌క్తులకు..తాజా పరీక్ష‌ల్లో నెగ‌టివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని వెల్లడించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్ర‌జ‌ల‌తో ఓ చిన్న శుభ‌వార్త షేర్ చేసుకుంటున్నాను. రాష్ట్రంలో గతంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 11 మందికి నేడు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది’ అని పేర్కొన్నారు.

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 74 సంవత్సరాల వృద్ధుడు ఇతరత్రా కూడా అనారోగ్య సమస్యలతో ఆస్ప‌త్రిలో చేరి మ‌ర‌ణించాడు. ఆ త‌ర్వాత ప‌రీక్ష‌లు చేయ‌గా అత‌డికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణలో తొలి కోవిడ్ మ‌ర‌ణం న‌మోదైన‌ట్లైంది.