ఉత్తర ప్రదేశ్ లో బాణాసంచా పేలుడు.. 11 మంది మృతి

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భడోహీలోని ఓ కార్పెట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు ధాటికి 11 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కార్పెట్‌ తయారీ పరిశ్రమలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాణాసంచా పేలుడుతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో బాణాసంచా పేలుడు.. 11 మంది మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:02 PM

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భడోహీలోని ఓ కార్పెట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు ధాటికి 11 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కార్పెట్‌ తయారీ పరిశ్రమలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాణాసంచా పేలుడుతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.