భారత్ ఆర్మీ ముసుగులో భారీ కుట్రకు ప్లాన్.. 11 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్..!
ఇండియన్ ఆర్మీ ముసుగులో భారీ కుట్రకు ప్లాన్ చేస్తోన్న బంగ్లాదేశ్ చెందిన 11 మంది వ్యక్తులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు.
Fake Air Force Personnel Arrested: ఇండియన్ ఆర్మీ ముసుగులో భారీ కుట్రకు ప్లాన్ చేస్తోన్న బంగ్లాదేశ్ చెందిన 11 మంది వ్యక్తులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి గౌహతిలో చోటు చేసుకుంది. లోక్ప్రియ గోపినాథ్ బోర్డోలియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో మొదటిగా నలుగురు అనుమానితులు భారత్ ఆర్మీ దుస్తుల్లో తిరుగుతుండటం గమనించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీనితో మిగిలిన ఏడుగురు కూడా పట్టుబడ్డారు.
వీరందరూ కూడా నెలరోజుల క్రితమే ఎయిర్పోర్ట్ దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ఇండియన్ ఆర్మీ దుస్తులు, ఐఏఎఫ్ నకిలీ గుర్తింపు కార్డులతో రక్కి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఐదు మోటార్ వెహికల్స్, నకిలీ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కూడా బంగ్లాదేశ్కు చెందినవారని.. వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని గౌహతి పోలీస్ అదనపు డిప్యూటీ కమిషనర్ సుప్రోటివ్ లాల్ బారువా వెల్లడించారు.
Also Read:
ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్లోకి ధోని, స్మిత్, విలియమ్సన్లు వచ్చే అవకాశం..
ధోనిని వదులుకోవడమే బెటర్.. సీఎస్కేకు ఆకాష్ చోప్రా ఉచిత సలహా..!
‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!