మావోయిస్టుల దుశ్చర్య, బలగాలపై ఐఈడీ దాడి.. ఓ జవాను మృతి, ఏడుగురికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా తాడ్మెట్ల ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో..
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా తాడ్మెట్ల ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. ఈ పేలుడులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మృతి చెందారు. ఐఈడీ పేలుడులో మరో ఏడుగురు కోబ్రా సిబ్బందికి గాయాలయ్యాయి.
సుక్మా జిల్లా తాడ్మెట్లలో శనివారం రాత్రి నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. ఆ సమయంలో తాడ్మెట్ల సమీపంలోని అటవీప్రాంతంలో బలగాలపై ఐఈడీ దాడి చేశారు మావోయిస్టులు. ఐఈడి పేలుడులో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిని తెల్లవారుజామున 12.45 గంటలకు రాయ్పూర్కు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావ్ మరణించారు. మిగతా ఏడుగురు ప్రమాదంలో లేరని పోలీసులు తెలిపారు.
Also Read :
‘ధరణి’ పేరిట నకిలీ మొబైల్ యాప్, ఇద్దరు అరెస్ట్, రైతులూ తస్మాత్ జాగ్రత్త !
ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని ‘మన్కీ బాత్’, వ్యాక్సిన్పై కీలక ప్రకటన చేసే అవకాశం !
ఏపీలో రెచ్చిపోతున్న దొంగలు, అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ!